ఉత్తర్ప్రదేశ్లో దేశంలోనే అతి పెద్ద ఆ రాష్ట్రంలో ఎన్నో నేరాలు జరుగుతుంటాయి. వింత వింత ఘటనలన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఇప్పుడు ఏకంగా ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై లైంగికదాడి చేశాడని ఓ యువతి ఆందోళన చేస్తూ ధర్నాకు దిగిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. తనకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం రాష్ట్ర రాజధాని లక్నోలో ఉంది. ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఊనా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరుడు గతేడాది జూన్లో తనపై లైంగికదాడికి పాల్పడ్డారు అని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు ఫలితం లేకపోగా బెదిరింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యం అని తెలిపారు. ఇది తనను అప్రతిష్ట పాల్జేయడానికే విపక్షాలు పన్నిన కుట్ర అని కుల్దీప్ సింగ్ సెంగర్ ఆరోపించారు.