తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కి దూకుడు ఎక్కువ .. ఆయన్ని అందరూ ప్రేమగా హనుమంతన్న అని పిలుస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అంటే మాత్రం ఆయనకి నచ్చాడు ఎందుకో. ఎదో ఒక అంశంలో ఆయన్ని లాగి మరీ తిడతారు హనుమంతన్న.
గవర్నర్ తరవాత హీరో పవన్ కళ్యాణ్ గురించి అడపా దడపా మాట్లాడుతూ ఉంటారు ఆయన , ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హనుమంతు రాజకీయాల గురించి మాట్లాడారు. తాజాగా ఏపీ లో కాపుల నాయకత్వం రాబోతోంది అని జోస్యం చెప్పారు ఆయన.
కాపుల కాలం నడుస్తోంది అని రెడ్డి లు, కమ్మలు ఇప్పటి వరకూ రాజ్యం ఎలాగా ఇప్పుడు కాపుల హవా రాబోతోంది అన్నారు ఆయన. రాష్ట్రం లో 28 శాతం మంది ఉన్న కాపులు నాయకత్వం వహించాలి అన్నారు వీహెచ్. పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తే కులమతాలకు అతీతంగా అందరి బతుకులు బాగుపడతాయని నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.
Related