చెన్నై అపోలో ఆసుపత్రిలో 74 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సీరియస్ అయ్యినట్లు ఆదివారం రాత్రి 9గంటల వేళలో బ్రేకింగ్ న్యూస్ గా బయటకు వచ్చింది. అమ్మకు గుండెపోటు హటాత్తుగా వచ్చిందని.. వెంటనే ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూ వార్డుకు తరలించినట్లుగా తెలిపారు.
ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు. అమ్మ ఆరోగ్యం గతంలోనూ సీరియస్ గా ఉన్నప్పటికీ చోటు చేసుకోని పరిణామాలు తాజాగా మాత్రం చోటు చేసుకోవటం అమ్మ అభిమానులకు ఆందోళన కలిగించటంతో పాటు.. కంట కన్నీరు కారేలా చేస్తున్నాయి. ఇంకోవైపు ఆదివారం జయలలిత పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు చెప్పరు అని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మకు మళ్లీ గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. ఈ విషయం తెలియాగానే.. గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రత పెంచారు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ భారత రాష్ట్రపతితో సహా.. ప్రధాని మోడీ రాత్రి వేళ ట్వీట్లు చేశారు.
Related