నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున ఎంపీ రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జానారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ ఒక బంజరుదొడ్డిగా మారిందని.. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క చర్చా జరగడం లేదని రేవంత్రెడ్డి ఆరోపించారు. సభ సక్రమంగా జరగాలంటే జానారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఎన్నికలప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్కు గొర్లు, బర్ల పథకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు.
బడులు మూతపడటంతో ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్న రేవంత్.. తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలే చనిపోయారని, కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరూ చనిపోలేదని దుయ్యబట్టారు.తెరాస నాయకులు డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
కారు గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు రాకుండా చేస్తామని గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని ఎదిరించడానికి మీవెంటే ఉంటానన్నారు. నాగార్జున సాగర్ను అభివృద్ధి చేసిన ఘనత ఒక జానారెడ్డికే దక్కుతుందని.. అలాంటి వారిని తిరిగి గెలిపించి రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని కోరారు.
తెలంగాణ మరో ఎన్నికలకు సిద్దం..
నేటి పంచాంగం, గురువారం (15-04-2021)