తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే యంత్రాంగం డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పుల వంటివి పూర్తి చేసిన సన్నద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు… జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. ఈనెల 30న పోలింగ్ జరుగుతుంది. మే 3న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
ఇవాళ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. రేపటి నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు.