- Advertisement -
నగరంలో మెట్రో రైలుకు శనివారం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. సుమారు 400మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు వెళ్లాల్సిన మెట్రో సర్వీసు అది వెళ్లాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ లో పయనించింది.
పొరపాటును గుర్తించిన డ్రైవర్… లక్డీకపూల్ స్టేషన్లో రైలును నిలిపివేశాడు. అనంతరం సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులను దించివేశారు. అనంతరం, మెట్రో ట్రైన్ వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అరగంటపాటు మెట్రో సేవలను నిలిపివేశారు.