ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి – కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది వ్యక్తిగత విభేదమా – వ్యవస్థాగత – సిద్ధాంతపరమైన విభేదమా అనే విషయం కాసేపు పక్కన పెడితే – కాపు ఉద్యమానికి సంబందించి వీరిద్దరి మధ్యా హాట్ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి! కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చే క్రమంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు చెబుతుంటే.. ఉద్యమ కారులను అణచివేస్తున్నారని – తన అనుచరులపై వేధింపులు ఎక్కువైపోతున్నాయని ముద్రగడ ఆరోపిస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే తాజాగా చంద్రబాబు వియ్యంకుడి రివాల్వర్ వాడకంపై ముద్రగడ కామెంట్స్ చేశారు.
పోలీసు వేధింపులు తనపైనా – తన అనుచరులపైనా ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీమంత్రి – కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వియ్యంకుడిని రివాల్వర్ అప్పగించమని పోలీసులు కోరుతున్నారని.. తనపై ఉన్న కోపానికీ – తన వియ్యంకుడు రివాల్వర్ అప్పగించడానికి సంబందమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో తన వియ్యంకుడు.. చంద్రబాబు వియ్యాంకుడిలా కాదని చెప్పిన ముద్రగడ… “రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను” అని అన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని – రాష్ట్రంలో మానవహక్కులు ఏమాత్రం లేవని ముద్రగడ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారని చెబుతున్న ముద్రగడ.. సమావేశానికి మండపం ఇచ్చినందుకే తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.
Related