Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై కేసులు కుట్ర‌పూరితం, నిరాధారం : సీనియ‌ర్ ఐఏస్ అధికారి కె.చంద్ర‌మౌళి

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా కేసులు మోపాయ‌ని.. నిరాధార ఆరోప‌ణ‌లు కోర్టుల్లో నిల‌బ‌డ‌వ‌ని సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్య‌నించారు. త్వ‌ర‌లో ఆ కేసుల‌న్నీ క్లోజ్ అయ్యి వైఎస్ జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ఐఏఎస్ అధికారి కె.చంద్ర‌మౌళి వ్యాఖ్యానించారు.

ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సీబీఐ, ఈడీ అధికారులు జ‌గ‌న్‌పై పెట్టిన కుట్ర‌పూరిత కేసుల్లో ఏ ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌ద‌ని ఆయన తెల‌క‌ప‌ల్లి ర‌వి నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఇంత‌కుముందు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు.

దానికి సింబాలిక్‌గా ఇటీవ‌ల జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ వీగిపోతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన రూ.34.64 కోట్ల ఆస్తుల‌ను తాత్కాలిక జ‌ప్తు చేయాలంటూ ఈడీ ఉత్త‌ర్వులును అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ త‌ప్పుబ‌ట్టింద‌ని, ఇటువంటి కేసుల‌ను ఇంకెప్పుడూ అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కు తేవొద్ద‌ని ఈడీకి అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌ని ఐఏఎస్ అధికారి కే.చంద్ర‌మౌళి తెలిపారు.

ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ అయ్యే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని, గ‌త పాల‌కులు జ‌గ‌న్‌పై పెట్టిన కేసుల‌న్నీ కుట్ర‌పూరిత‌మైన‌వేన‌ని, ఆధారాలు లేకుండా కేసులు పెడితే.. ఆ కేసుల విచార‌ణ‌ను కోర్టులు స్వీక‌రించ‌వ‌ని ఐఏఎస్ అధికారి కే.చంద్ర‌మౌళి స్ప‌ష్టం చేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -