Monday, May 13, 2024
- Advertisement -

భారత్‌ గబ్బిలాల్లో కరోనా వైరస్‌ : ఐసీఎంఆర్‌ ప్రకటన

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ కరోనా వైరస్. ఇది ఇప్పుడు మన దేశంలో కూడా పెరిగిపోతుంది. ఈ నెపథ్యంలో రెండు రకాల గబ్బిలాల జాతుల్లో ‘బ్యాట్ కరోనా వైరస్‌’ను మొదటిసారి గుర్తించారు భారతీయ పరిశోధకులు. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడుల్లో గబ్బిల్లాల్లో ఈ వైరస్‌ను మొదటిసారి గుర్తించినట్లు వివరించారు. ఈ విషయంను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది.

అయితే బ్యాట్ కరోనా వైరస్ మనుషులకు హానికరమన్న ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టతనిచ్చింది. ఈ వైరస్ ను 25 గబ్బిల్లాల్లో గుర్తించారు. ప్రస్తుతం మానవాళిని పీడిస్తోన్న కరోనా వైరస్‌కు, బ్యాట్‌ కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్‌ తెలిపింది. మహారాష్ట్రలోని పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో కలిసి నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడైనట్లు ఐసీఎంఆర్‌ అందులో పేర్కొంది. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరిలోని రౌసెటస్, టెరోపస్ ( ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌ ) అనే రెండు రకాలకు చెందిన గబ్బిలాల్లో ‘బ్యాట్‌ కరోనా వైరస్‌’ను గుర్తించినట్లు తెలిపింది.

అయితే 2018, 2019లో ఈ గబ్బిలాల వల్ల కేరళలో నిఫా వైరస్ వచ్చి.. అప్పట్లో ఆ రాష్ట్రంలో 17 మంది మరణించారు. అలానే తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు,పంజాబ్‌, గుజరాత్‌, ఒడిశా, చండీగఢ్‌ల్లో ఉండే పలు రకాల గబ్బిలాలపై ఈ పరిశోధన చేసినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రకటించింది. కొత్తగా గబ్బిల్లాల్లో గుర్తించిన వైరస్ వల్ల మనుషుల్లో ఇన్‍ఫెక్షన్లు కల్గుతాయని ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. గత ఏడాది నిఫా వైరస్ కేరళను వణించిన నేపథ్యంలో తాజా రీసెర్చ్‌ జరుపుతూ గబ్బిలాల శరీర స్త్రావాలను పరీక్షించగా వాటిలో ఈ కరోనా వైరస్ ఉన్న విషయం ఉందని తేలింది. అయితే మనుషుల్లో గుర్తించిన కరోనా వైరస్ కు, గబ్బిలాలకు మధ్య ఉన్న లింక్ పై మాత్రం ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -