Monday, April 29, 2024
- Advertisement -

చైనా తో భారత్ భేటి.. ఇంకా పది దేశాలు..!

- Advertisement -

స్వీయ నిగ్రహం పాటించడం, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని.. చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 7 నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజ్​నాథ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వర్చువల్​గా జరిగిన ఆసియాన్​ ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​(రక్షణమంత్రుల సమావేశం)లో పాల్గొన్నారు రాజ్​నాథ్​. పరస్పర సహకారంతో మెలిగే పరిస్థితులను కల్పించడంలో ఆసియాన్​ దేశాల పాత్రను కొనియాడారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘి కూడా ఉన్నారు. మొత్తం మీద 10 ఆసియాన్​ దేశాలతో పాటు ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​లో ఆస్ట్రేలియా, చైనా, భారత్​, జపాన్​, న్యూజిలాండ్​, రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా, రష్యా, అమెరికా కూడా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -