- Advertisement -
స్వీయ నిగ్రహం పాటించడం, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని.. చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్. 7 నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వర్చువల్గా జరిగిన ఆసియాన్ ఏడీఎమ్ఎమ్-ప్లస్(రక్షణమంత్రుల సమావేశం)లో పాల్గొన్నారు రాజ్నాథ్. పరస్పర సహకారంతో మెలిగే పరిస్థితులను కల్పించడంలో ఆసియాన్ దేశాల పాత్రను కొనియాడారు.
ఈ సమావేశానికి హాజరైన వారిలో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘి కూడా ఉన్నారు. మొత్తం మీద 10 ఆసియాన్ దేశాలతో పాటు ఏడీఎమ్ఎమ్-ప్లస్లో ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, అమెరికా కూడా ఉన్నాయి.