- Advertisement -
వాయిసేనలో తరుచూ ప్రమాదాలు చోటు చేసకుంటున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం సమీపంలోని హెలీపాడ్ వద్ద ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ఆర్మీ కార్గో హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ సమయంలో ఇనుప రాడ్ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్ను కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేస్తుండంగా ఐరన్ గిర్డర్కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.