Monday, May 13, 2024
- Advertisement -

హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన గ‌వ‌ర్న‌ర్‌, మంత్రులు

- Advertisement -

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఆయ‌న‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు.

రేపు ఉదయం 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం చెన్నై వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -