Sunday, May 5, 2024
- Advertisement -

రేవంత్ ను పట్టించింది తెలుగుదేశం నేతలేనా..?!

- Advertisement -

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రభావితం చేయడానికి డబ్బును ఎరగా చూపి.. ఏసీబీకి పట్టుబడి నాన్ బెయిలబుల్ కేసును ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని పట్టించింది ఎవరు? ఈ వ్యవహారం అంతా కుట్ర అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి తదితరులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర అని.. రేవంత్ ధాటిని తట్టుకోలేక ఇలా బుక్ చేశారని వారు అంటున్నారు.

 

తనతో ఏదో సమస్య చెప్పుకొంటాను అంటేనే తను స్టీఫెన్ సన్ తమ్ముడి ఇంటికి వచ్చానని రేవంత్ అంటున్నాడు. తనకూ ఆ డబ్బుకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొస్తున్నాడు. మరి  ఈవ్యవహారం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి వారు మాత్రం రివర్స్ లో అటాక్ చేస్తున్నారు. రేవంత్ ను ఇరికించింది తెలుగుదేశం నేతలే అని వీరు అంటున్నారు.

ఇలాంటి వ్యవహారాలన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే.. రేవంత్ రెడ్డి ఎక్కడ పెద్ద నేత అయిపోతాడో అని తెలంగాణ తెలుగుదేశం నేతలే ఆయనను ఇరికించి ఉండవచ్చని వారు అంటున్నారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఈ ఆరోపణ చేశాడు. రేవంత్ ఎదుగుదలను సహించలేని ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వ్యక్తే ఆయనను ఇరికించి ఉండవచ్చని ఈయన సందేహం వ్యక్తం చేశాడు. మరి ఈ వ్యవహారం గురించి తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -