- Advertisement -
ఎన్నికల వేల ఆంధ్రప్రదేశ్లో ఐటీ అధికారులు దాడులు కలకలం రేపుతున్నాయి. మైదుకూరు టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ అధికారలు సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు 8 రోజుల ముందే సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. దీంతో సీఎం రమేష్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.