Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్రబాబు గురూజీ ఇద్దరు అమ్మాయిలని దాచేశారు ?

- Advertisement -

టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి అత్యంత ఆప్తులు, గురువు అయిన ఈశా యోగా సెంటర్ స్థాపకులు జగ్గీ వాసుదేవ్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఏపీ ఎమ్మెల్యే లకి చంద్రబాబు కోరిక మేరకు జగ్గీ వాసుదేవ్ యోగ మీద శిక్షణా తరగతులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జగ్గీ సంస్థల కోసం చంద్రబాబు పెద్దఎత్తున భూ కేటాయింపులు కూడా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి బాబుకి సన్నిహితం అయిన బాబా మీద తమిళనాడు కి చెందిన వృద్ధ దంపతులు సంచలన ఆరోపణ చేసారు.

తమ ఇద్దరు కూతుళ్ళని స్వామీజీ తన దగ్గర పెట్టేసుకున్నారు అనేది వారి ఆరోపణ. వారు కోయంబత్తూర్ జిల్లా కలక్టర్ కి ఈ ఫిర్యాదుని అందించారు. కోయంబత్తూరు లోని కామరాజ్ దంపతులకి గీతా కామరాజ్ – లతా కామరాజ్ అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వీరిద్దరి వయసూ 33 , 31 సంవత్సరాలు . గీత ఎంటెక్ చదవగా లతా బీటెక్ చదివింది.

ఇద్దరూ యోగా శిక్షణ కోసం ఈశా సెంటర్ కి వెళ్ళారు. ఈ క్రమం లో వారిని తనవైపు తిప్పుకున్న స్వామీజీ వారిని రానివ్వడం లేదు అంటూ ఆరోపోస్తున్నారు వీరు.  కామరాజ్ సతీ సమేతంగా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తన కూతుళ్ల పరిస్థితిపై కలెక్టర్ కు ఓ వినతిపత్రం సమర్పించారు. ఉన్నత విద్యావంతులైన తన కూతుళ్లకు తాను పెళ్లిళ్లు చేయాలనుకుంటుంటే ఆయన వారిని సన్యాసులుగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -