Friday, May 3, 2024
- Advertisement -

కాశ్మీర్‌లో ఎన్ కౌంట‌ర్‌…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం

- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, తీవ్ర వాదుల‌కు మ‌ధ్య భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనగర్ లో ఉన్న ఫతేహ్ హడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.

ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, స్కూళ్లు, షాపుల్ని మూసివేసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రమూకలు ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు. భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులతో ధీటుగా సమాధానమిచ్చాయి. ఈ హోరా హోరీ పోరులో ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. కాని దురదృష్టవశాత్తూ ఉగ్రమూకల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -