Thursday, May 2, 2024
- Advertisement -

రాహుల్ గాంధీనే లక్ష్యంగా చేసుకొన్న రెడ్డి బ్రదర్స్ !

- Advertisement -

తమ లక్ష్యాలు.. తమ పనులు అన్నీ ఒక రేంజ్ ఉంటాయని పలు సార్లు నిరూపించుకొన్నారు జేసీ బ్రదర్స్. ఇప్పుడు కూడా వారు అదే రీతిన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.

ఈ సారి వారు ఏకంగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీనే లక్ష్యంగా చేసుకొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకొని తీరతామని వారు ప్రకటించారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో స్పందించాడు.

రాహుల్ గాంధీకి రైతులను పరామర్శించే అర్హత లేదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశాడు. కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని.. అప్పట్లో ఆ విషయంపై స్పందించని రాహుల్ ఇప్పుడు ఎలా పరామర్శకు వస్తాడనేది ప్రభాకర్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. ముందుగా రాహుల్ నాడు ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాలకు పరిహారాన్ని అందించి.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకొన్న వాళ్లకు మళ్లీ పరిహారాన్ని అందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

మరి ఇప్పుడు జేసీ జూనియర్ రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకొని తీరతామని ప్రకటించడం చాలా చిత్రమే. ఎందుకంటే.. మొన్నటి వరకూ జేసీ సోదరులు కాంగ్రెస్ లో ఉండేవారు.. సోనియాగాంధీకి వీర విధేయులుగా ఉండేవారు. అలాంటి వాళ్లు ఇప్పుడు తెలుగుదేశం నేతలుగా..రాహుల్ గాంధీపై విరుచుకుపడటానికి మించిన విడ్డూరం ఏముంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -