కర్నాటకలోకి జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్ సభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కర్ణాటక విధాన సభ స్పీకర్ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలలో రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్, రమేశ్ జర్క హళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాదగౌడ పాటిల్, శివరామ్ ఉన్నారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ… కొన్ని అంశాల్లో తనను నిర్లక్ష్యం చేశారని తెలిపాడు. పార్టీలో నేను ఎవరినీ నిందించట్లేదని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం స్థానాలు 224. బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎనిమిది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వ బలం మరింత తగ్గనుంది