Tuesday, March 19, 2024
- Advertisement -

సీబీఐ డైరెక్టర్ ను కలిసిన కెఏ పాల్

- Advertisement -

సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు పిర్యాదు చేసిన కే ఏ పాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు, 9 లక్షల కోట్ల అవినీతికి, కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడింది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు.. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు.

కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది.. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెదఫా ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.

తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు.. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 75 వేల కోట్లు దోచుకున్నారు.. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది. 2 వేల కోట్ల అంచనా లో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారు.

కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి.. ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీల పై కూడా విచారణ జరపాలి.. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తాను. సిబిఐ తో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు పిర్యాదు కాపీలను పంపిన కెఏ పాల్.

ఇవి కూడా చదవండి

మోడీ మౌనం అందుకేనా ?

చైనా అమెరికా వార్.. కారణం ఆదేనా ?

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -