- Advertisement -
కర్నాటకలో భాజాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం అయ్యింది. సాయంత్రం ముఖ్యమంత్రిగా భాజాపా నేత యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటకలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎప్పుడు ప్రభుత్వం ఉంటుంది? ఊడిపోతుంది? అనే ఉత్కంఠకొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈసారి యడ్యూరప్ప తన పేరును మార్చుకున్నారు.
న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరును Yeddyurappa నుంచి Yediyurappaగా మార్చుకున్నారు. తన పేరులోని D అక్షరాన్ని తొలగించి ఆ స్థానంలో Y అక్షరాన్ని చేర్చారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నట్లు సమాచారం.