Monday, May 20, 2024
- Advertisement -

మూడు రోజులు ఆగండి…అస‌లు విష‌యం తెలుస్తుంది క‌త్తి మ‌హేష్‌….

- Advertisement -

ఇటీవలి కాలంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్‌ గా ఉన్న సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ తాజాగా మ‌రో ట్వీట్ చేశాడు. జనవరి 15 వరకూ సైలెంట్ గా ఉంటే ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందన్న నిర్మాత కోన వెంకట్ సలహాను పాటిస్తున్నానని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా గత రాత్రి ఓ ట్వీట్ వదిలాడు. “ఖాళీ పాత్ర‌లే ఎక్కువ శ‌బ్దం చేస్తాయి. నిజాల కోసం జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు ఆగండి” అని కత్తి ఓ ట్వీట్ వదిలాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన ‘అజ్ఞాత‌వాసి’, ఓ చెత్తి సినిమా అని కత్తి రివ్యూ ఇచ్చిన తరువాత, పవన్ అభిమానులు ఆయనపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సినిమా థియేటర్లే ఏ చిత్రం భవిష్యత్తు ఏంటన్న విషయం చెబుతాయన్న అర్థం వచ్చేలా కత్తి ట్వీట్ వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -