తెలంగాణలో సరికొత్త రాజకీయపార్టీ ‘వైఎస్ఆర్ టీపీ’ కార్యాచరణపై వైఎస్ షర్మిళ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన ఆమె, ఈనెల 20న ఖమ్మం జిల్లా దివంగత రాజన్న అభిమానులతో సమావేశం కానున్నారు. అయితే తెలంగాణలో షర్మిళ పార్టీ పెట్టడం పై భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుల ప్రభంజనం కొనసాగిందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ పరిపాలన చూసి అందరూ ఆదరించారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు.
తెలంగాణలో పార్టీ ఆలోచన షర్మిల వ్యక్తిగత ఆలోచనేనని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో వైఎస్ఆర్ అభిమానులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదన్నారు.
తప్పు చేస్తున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం : చంద్రబాబు