- Advertisement -
నిన్న తెలంగాణ సిఎం కేసిఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురి దగ్గర పుష్కర స్నానం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల మందితో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయాయి.
అయితే కేసిఆర్ పుష్కర స్నానం చేస్తుండగా ఒక స్పెషల్ గెస్ట్ అందరికి షాక్నిచ్చింది. కేసిఆర్, ఆయన సతీమణి ఎదురుగా పీఠాధిపతులతో స్నానం చేసే సందర్భంలో ఒక పాము ప్రత్యక్షమైంది. వెంటనే అక్కడ సిబ్బంది పామును బెలూన్ ట్యూబ్ తో బందించారు. కొందరు ఇది శుభపరిణామం అంటున్నారు.