Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియ‌ర్ నాయ‌కుడు మృతి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క‌మిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఐతం సత్యం శుక్రవారం (ఏప్రిల్ 6) తెల్లవారుజామున అకాల మృతిచెందారు. కొంత‌కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సత్యం హైదరాబాద్‌లోని మాక్స్‌క్యూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు.

ఆయ‌న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, నాయకులు మల్లు రవి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సత్యం భౌతికకాయాన్ని ఖమ్మం తరలించి ప్రజల సందర్శనార్థం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొద్ది సేపు ఉంచుతారు.

అయితే సత్యం మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వరంగల్‌లో కొన‌సాగుతున్న బ‌స్సు యాత్ర నుంచి హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -