Monday, May 13, 2024
- Advertisement -

పాఠ‌శాల నిర్ల‌క్ష్యం ప‌సికందు ప్రాణం తీసింది…

- Advertisement -

ఓ పాఠశాల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాన్ని తీసింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి లోని బచ్ పన్ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలల దినోత్సవం రోజున హైదరాబాద్ విషాదం చోటు చేసుకోవ‌డంతో ఆకుంటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

శివ రచిత్ అనే బాలుడు సంపులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మల్కాజ్ గిరి లోని బచ్ పన్ స్కూల్ లో జరిగింది. విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాలుడి మరణ వార్త విన్న ఆ తల్లితండ్రులను ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు.

శివ చరిత్ అనే నర్సరీ చదివే బాలుడు రోజులాగే పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాల ఉన్న ప్రాంతంలో మంచి నీటి సరఫరా జరిగింది. ఇందుకోసం సంపు మూతను తెరిచి ఉంచారు. అయితే మూతను మూసివెయ్యడం మరచిపోయారు. దీనిని గమనించని బాలుడు తరగతి గదిలోకి వెళుతు సంపులో పడిపోయాడు. బాలుడు పడిన విషయం ఎవ్వరు గమనించలేదు.

అయితె కొద్ది సేపటి తర్వాత సంపులో స్కూల్ బ్యాగ్ తేలింది. అనుమానంతో పాఠశాల యాజమాన్యం చెక్ చెయ్యగా బాలుడు మృతి చెందాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది పాఠశాల యాజమాన్యం. విషయం తెలుసుకున్న బాలుడి తల్లితండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు.వారి బంధువులు స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని దాడికి దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -