దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు సఫారీ బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. భారత బ్యాట్స్మెన్ బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా రబాడ వన్ మ్యాన్ షోతో బౌలింగ్లో రెచ్చిపోగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో ఒకే ఒక్కడుగా రాణించాడు. రాహుల్ 105 బంతుల్లో 2 సిక్స్లు, 10 ఫోర్లతో 70 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూల్ 24 పరుగులు చేశారు.
రోహిత్ 5,జైస్వాల్ 17,గిల్ 2,అశ్విన్ 8 విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ 5 వికెట్లు పడగొట్టగా, బర్గర్ 2 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో 24 పరుగులకే దక్షిణాఫ్రికా 3 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ముఖ్యంగా బౌలింగ్కు అనుకూలింగే పిచ్పై సఫారీ పేసర్లు రెచ్చిపోయారు. బౌన్స్కు తోడు బాల్ స్వింగ్ అవుతుం డటంతో భారత్ వరుసగా వికెట్లను కొల్పోయింది. భారత్ 121/6 పరుగులుగా ఉండగా రాహుల్ ఒంటరి పోరాటం చేశారు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.ఒకే ఒక్కడుగా ఒంటరిపోరాటం చేశాడు.