Friday, March 29, 2024
- Advertisement -

హై కోర్టుకి కొడాలి నాని అభ్యర్థన.. ఎందుకంటే..!

- Advertisement -

మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొడాలి నాని కోర్టులో పిటిషన్ వేశారు.

రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని)ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లోగానీ, బృందాలతోగానీ మాట్లాడరాదని తెలిపారు.

కృష్ణా జిల్లా కలెక్టరు, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌ ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలన్నారు.గతంలో విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిపై సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రమేశ్‌కుమార్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసిచ్చారు.

మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని నాని పేర్కొన్నారు.

BREAKING NEWS : సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఫోటో ఫీచర్ : అందమైన చిరునవ్వు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -