Friday, April 26, 2024
- Advertisement -

BREAKING NEWS : సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్!

- Advertisement -

బాలీవుడ్ నటుడు అయినా తెలుగు వారికి మంచి సుపరిచితుడు సచిన్ జోషి.  ‘ఒరేయ్ పండు’, ‘మౌనమేలనోయి’, ‘జాక్ పాట్’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. హీరోగానే కాకుండా నిర్మాత, వ్యాపారవేత్త అయిన సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. కాగా, ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యాకు సంబంధించిన బంగ్లాను సచిన్ కొనుగోలు చేసాడు.

గోవాలోని ఈ బంగ్లాను కొన్ని రోజుల కింద కొన్నాడు సచిన్ జోషి. అయితే ఈ విషయంలో ఓంకార్ రియాల్టీ కేస్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవతతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. అయితే ఈ కేసులో దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఫోటో ఫీచర్ : అందమైన చిరునవ్వు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

పుష్ప ఔట్ ఒక రేంజిలో వచ్చిందట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -