వెండితెరపై ఒక్క సారి తళుక్కున మెరిసి తమ ఖాతాలో ఒక్క హిట్ వేసుకుంటే చాలు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఈ విషయంలో హీరోయిన్లకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ.. రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సినిమాకు వర్క్ చేసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు, మిగతా చిత్ర బృందానికి ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబులకు మస్తు ఆఫర్లు వస్తున్నాయి. ఇక హీరోయిన్ కృతి శెట్టి పంటపండిందనే చెప్పాలి. మొదటి సినిమాలోనే అద్భుతంగా నటించడం, సినిమా పలు రికార్డులు తిరగరాయడంతో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు మూడు నాలుగు సినిమాల్లో కథానాయికగా ఎంపికైంది.
ఉప్పెన సినిమా విడుదలకు ముందే నాని శ్యాంసింగరాయ్లో నటించే అవకాశం దక్కించుకుంది కృతిశెట్టి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ను దక్కించుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రాబోయే సినిమాలో హీరోయిన్గా నటించే లక్కి ఛాన్స్ కొట్టేసింది కృతిశెట్టి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై రాబోతున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ధృవీకరిస్తూ.. ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.
బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !
ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?