తెలంగాణ ప్రజలకోసం టీఆర్ఎస్, కేసీఆర్ పనిచేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం ఏపీ సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే.తారక రామారావు స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా తెలంగాణ అభివృద్ధి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన మరోసారి ఆరోపించారు. మా సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే.. చంద్రబాబు మాత్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ కు నీళ్లిచ్చేందుకు మేం ప్రయత్నం చేసినప్పటికీ నీళ్లివ్వద్దని చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాశారని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్ లో జర్నలిస్టుల చర్చగోష్టి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేశారు.
షీ టీమ్స్, షీ షటిల్స్ పేరుతో హైదరాబాద్ లో శాంతి భద్రతలకు పెద్ద పీట వెస్తున్నామన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, పాలమూర్ జిల్లా బేధం లేకుండా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని అయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆయూత చండీయాగం చేస్తే హిందూ ముద్ర వేయడమేంటీ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఏపీలో అదికారంలోకి వచ్చాక ఏడు మండలాలను తెలంగాణకు అన్యాయం చేసేలా చంద్రబాబు తన రాష్ట్రంలో కలిపేసుకున్నాడని.. అలాంటి వారు హైదరాబాద్ ఓట్లేలా అడుగుతారన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకుండా పోయిందన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులు మొత్తుకున్నా బాబే వారికి పట్టించుకోవడంలేదని.. ఇక తెలంగాణ ప్రజలను ఏలా పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు.