తమిళ ప్రముఖ నటుడు కమల్హాసన్ రాజకీయ ప్రవేశం చేశారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి బుధవారం (ఫిబ్రవరి 21) నుంచి రాజకీయ యాత్ర చేపట్టారు. పార్టీ ప్రకటన చేశారు. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ ప్రకటన కార్యక్రమానికి కమల్ హాసన్ ఆహ్వానించారు. అయితే వివిధ కార్యక్రమాలతో తాను రాలేకపోతున్నానని ట్వీటర్ ద్వారా కమల్కు చెప్పారు. అయితే కమల్ పార్టీని తాను ఆహ్వానిస్తున్నట్లు… ప్రజా జీవితంలోనూ గెలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
కమల్ రాజకీయ ప్రకటన కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కూడా ఆహ్వానించారు. కానీ కేటీఆర్ మాత్రం రాలేనని ట్వీట్ చేశారు. ‘కమల్ హాసన్ జీ.. మదురైలో నిర్వహించనున్న పార్టీ ప్రకటన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. కానీ కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నా. మీ కొత్త ప్రయాణానికి గుడ్లక్. నిజ జీవిత ‘నాయకుడు’ కూడా హిట్ అవ్వాలని ఆశిస్తున్నా’ అని ట్విట్టర్లో కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే తనదైన శైలిలో కమల్కు మద్దతు ప్రకటించారు. 1987లో కమల్హాసన్ నటించిన ‘నాయకుడు’ సినిమా సూపర్గా ఆడింది. సినిమాలాగే నిజ జీవిత ‘నాయకుడు’ కూడా గెలవాలి అనే ఉద్దేశంలో ట్వీట్ చేశారు.
అయితే కమల్హాసన్ పార్టీ కార్యక్రమం మధురైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ్బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన సహచన నటుడు రజనీకాంత్ కూడా హాజరయ్యారు.