తెలంగాణలో రెండు నెలల క్రితం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో 12 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. మొదట 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇవ్వగా.. తర్వాత 6 నుంచి 2 గంటల వరకు లాక్ డౌన్ ఉండగా.. ప్రస్తుతం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్డౌన్ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
మోహన్ లాల్ ‘మరక్కర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!