మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరింయట్ విజృంభిస్తున్న సమయంలో శివసేన సర్కార్ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోకి పౌరులను అనుమతించయడంలేదు. ఒకవేళ రాష్ట్రానికి రావాలంటే కోవిడ్ డోసులు రెండు తప్పనిసరిగా వేసుకొని ఉండాలని కండీషన్ విధించింది.
మరో వైపు సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ విలయతాండవం చేస్తుండటంతో.. అక్కడి నుంచి వచ్చే విమానాలకు, షిప్లకు అనుమతి లేదని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. మహారాష్ట్ర రాజధాని ముంభై నగరం చాలా పెద్దది. అక్కడి వీదులు చిన్నగా ఉంటాయి. దీంతో జనసంచారం ఎక్కువగా ఉండటంతో శివసేన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభన సమయంలో రోజుకు 50 వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్ చాపకింద నీరులా పాకింది. ఆక్సిన్ అందక అనేక మంది మరణించారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.