Monday, April 29, 2024
- Advertisement -

అమెరికా లో గాంధీ విగ్రహం ధ్వంసం.. మొదలైన చిచ్చు..!

- Advertisement -

అమెరికా వాషింగ్టన్​లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఖలిస్థానీ వేర్పాటువాదులు. భారత్​లో కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరికన్లు చేపట్టిన నిరసనల సందర్భంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

భారత్​లో నిరసనలు చేస్తోన్న రైతులకు సంఘీభావంగా.. గ్రేటర్​ వాషింగ్టన్​ డీసీ, మేరీలాండ్​, వర్జీనియాలతో పాటు న్యూయార్క్​, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్​ కరోలినా వంటి రాష్ట్రాల నుంచి వందల మంది సిక్కులు ఆందోళనలు చేపట్టారు. వాషింగ్టన్​ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద కార్ల ర్యాలీ నిర్వహించారు.

అయితే.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనల్లో వేర్పాటువాద సిక్కులు ఖలిస్థానీ జెండాలు, భారత వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లతో ప్రవేశించటంతో ఉద్రిక్తంగా మారాయి. వారంతా ‘ద రిపబ్లిక్​ ఆఫ్​ ఖలిస్థాన్​’కు చెందినవారిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఖలిస్థానీ అనుకూల సిక్కు యువత.. మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టర్లను గాంధీ విగ్రహంపై ఉంచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -