- Advertisement -
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూకు బదులుగా జిన్నాకు భారత ప్రధాని పదవిని అప్పగించి ఉంటే దేశ విభజన జరిగిఉండేదే కాదని వ్యాఖ్యానించారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు.