విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో మరో సారి ‘కత్తి’ కలకలం రేపింది. కత్తితో ఉన్న వ్యక్తి ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓవ్యక్తిని సీఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకొన ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. కత్తితో ఎయిర్ పోర్టుకు వచ్చిన వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా పోలీసులు గుర్తించారు. లోవరాజుకు మతి స్థిమితం లేదని, కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
అతని బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2007 నుంచి ప్రభుత్వాసుపత్రిలో లోవరాజు చికిత్స పొందుతున్నారని, ఇందుకు సంబంధించిన పుస్తకం, మందులు ఆయన బ్యాగ్ లో ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ మతిస్థిమితం లేదని, పొంతన లేకుండా ఆయన మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎయిర్పోర్ట్కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.