సినీ నటుడు మోమన్బాబు కుమారుడు మంచు మనోజ్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.ప్రస్తుతం నటిస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మరొక్క చిత్రంలో మాత్రమే తాను నటిస్తున్నానని మనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఫిలిం వర్గాల్లో వైరల్గా మారింది.
ఎందుకు ఈ నిర్నయం తీసుకున్నాడో తెలియనప్పటికి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాను ఇకపై సినిమాల్లో నటించబోనని మనోజ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. యువ హీరోనే అయినప్పటికీ అప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుండడంతో కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉందని భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
{loadmodule mod_custom,GA1}
అయితే ఈనిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివిరించనప్పటకి…మనోజ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నందునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.ఇక మోహన్బాబుకూడా సినిమారంగంనుంచి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొద్దికాలం రాజకీయాల్లో వెలిగారు.
ఇప్పుడు మనోజ్ కనుక రాజకీయాల్లోకి వస్తే ఎంతవరకు రాణిస్తారన్నది చూడాలి. దివంగత వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ వైసీపీ నుంచే పోటీ చేస్తారని అనుకుంటున్నారు. వీటిపై మోహన్బాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}ujaUcCHBzG4{/youtube}