Friday, May 17, 2024
- Advertisement -

మణిపుర్​ సీఎం ఎన్​. బీరెన్​సింగ్​కు కరోనా పాజిటివ్..!

- Advertisement -

మణిపుర్​ సీఎం ఎన్​. బీరెన్​సింగ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారంతా వెంటనే కొవిడ్​ టెస్టు చేయించుకోవాలి’ అని ట్వీట్​ చేశారు బీరెన్ సింగ్. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని పేర్కొన్నారు.

దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో తాజాగా 42,156 మంది వైరస్​ను​ జయించారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 5 లక్షల దిగువనే కొనసాగుతోంది. నవంబరు 14 వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల 48 లక్షల 36 వేలకుపైగా కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ప్రముఖ నటుడు కన్నుమూత..!

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -