స్కూళ్లలో పిల్లకు చదువులు చెప్పాల్సిన టీచర్లు పెడదారిన పడుతున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థులతో ప్రేమలో పడి లేచిపోయిన దాఖలాలు చాలనే ఉన్నాయి. అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. పెళైన రెండు నెలలకే ఓ టీచర్ టెన్త్ కుర్రాడితో లేచిపోయింది.
వివరాల్లోకి వెల్తే…. అమె వయసు 26 సంవత్సరాలు. ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో నెల కిందటే వివాహం జరిగింది. భర్తకు షాక్ ఇస్తూ తాను విద్యను బోధించే పదో తరగతి విద్యార్థితో కలసి ఆమె పరారైంది. చివరకు పోలీస్టేషన్కు వెళ్లి తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
తమిళనాడు సేలం, తిరువాగౌండనూరుకు చెందిన ఓ మహిళకు గత నెల 19న పెళ్లయింది. భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తుండటంతో, వివాహమైన వారం తరువాత అతను వెళ్లిపోగా, ఆమె పుట్టింటికి వచ్చింది. సోమవారం నాడు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ దాకా వెళ్లి వస్తానని చెప్పిన ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్లను ఆశ్రయించారు. బాలుడితో సహా స్టేషన్ కు వచ్చిన ఆమె, విద్యార్థితోనే ఉంటానని చెప్పడంతో, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రాను రాను విద్యార్థులు, టీచర్ల మధ్య సంబంధాలు అధోస్థాయిచి చేరుతున్నాయనే దానికి ఉదాహరణే ఈ సంఘటన.