Friday, April 26, 2024
- Advertisement -

సీమకు నీరిచ్చిన నిజమైన హీరో రఘువీరా : చిరంజీవి

- Advertisement -

తాను సినిమాల్లో మాత్రమే హీరోనని నిజ జీవితంలో మాత్రం రఘువీరా రెడ్డి తాను చేసే మంచి పనులతో రియల్ హీరో గా నిలిచారని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తన స్వగ్రామమైన నీలకంఠాపురం లో పురాతన ఆలయాల జీర్ణోద్దరణ కార్యక్రమం చేపట్టాడు. అలాగే మరికొన్ని నూతన ఆలయాలను నిర్మించాడు. ఈ ఆలయాల ప్రారంభోత్సవానికి రఘువీరారెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రఘువీరా గురించి మాట్లాడుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతి కొద్దికాలంలోనే రఘువీరారెడ్డి, తనకు ఎంతో సన్నిహితుడిగా మారాడు. నేను సీమకు నీరందించడం కోసం ఇంద్ర సినిమాలో యజ్ఞాలు, యాగాలు చేశాను. రఘువీరారెడ్డి మాత్రం తనను నాయకుడిగా నిలబెట్టిన జనం కోసం నీరందించి రియల్ హీరో గా నిలిచాడు. వారి దాహం తీర్చాడు. ప్రస్తుతం మా రాజకీయ స్తబ్దతతో నేను సినిమాలు చేసుకుంటూ ఉండగా, రఘువీరారెడ్డి రైతు గా మారాడు.

అంతే కాకుండా ఆయన స్వగ్రామంలో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ నూతన ఆలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా రఘువీరారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత కరోనా పరిస్థితులు సద్దుమణగానే నేను కచ్చితంగా నీలకంఠాపురం గ్రామానికి వస్తాను. రఘువీరా రెడ్డి ప్రజల సహకారంతో నిర్మించిన ఆలయాలను సందర్శిస్తాను’ అని చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -