అభం, శుభం తెలియని మైనర్ బాలికను పొట్టన పెట్టుకున్నారు కామాంధులు. మానవత్వాన్ని మంటగలిపి చిన్నపిల్ల అనే కనీస కనికరం లేకుండా కూలీ పనులు చేసే ఓ బాలకపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు తండ్రీకొడుకులు. వావి వరుసలు మరచి మాయమాటలు మరచి లోబరుచుకున్నారుని తల్లిని చేశారు .
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరికి చెందిన ఓ 16ఏళ్ల బాలిక కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన భూతం శ్రీను అనే వ్యక్తి, అతని కొడుకులు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
గురువారం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆమెను దేవరకొండలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. బాలికను పరీక్షించిన వైద్యులు, ఆమె ఏడు నెలల గర్భవతి అని తేలిపారు. బాలికను నిలదీయగా అసలు విషయం బయటికి వచ్చింది.
తండ్రీ, కొడుకులను బాలిక కుటుంబ సభ్యులు నిలదీస్తే అబార్షన్ చేయించుకొమ్మని 5 వేల రూపాయలు చేతిలో పెట్టారు ఆ దుర్మార్గులు. అబార్షన్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు… ఏడో నెలలో గర్భం తీసేయడం కుదరదని తెల్సింది. దీంతో ఈ విషయం ఊళ్లో తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధిత బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది .
బాలిక మృతితో ఆగ్రహించినగ్రామస్థులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో నిందితుల ఇంటి ముందు నిరసన చేపట్టారు. బాలిక ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో నిరసనకు దిగిన వారిని సముదాయించి నిందితులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బాలిక అంత్యక్రియలు జరిపారు.