టిడిపికి తెలంగాణలో మళ్ళీ షాక్ తగలనుంది. ఇప్పటికే ఈ పార్టీ ఓటుకు నోటు కేసులో తీవ్రంగా నష్టపోయి పీకల్లోతు కూరుకుపోయింది.
ఈ సమయంలో తెలంగాణ టిడిపికి ఆ పార్టీ నేతలు కొంత మంది గుడ్బై చెప్పి, టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టిడిపి నేత, మాజీ మత్రి మోత్కుపల్లి నరసింహులు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
2014లో ఖమ్మం జిల్లా మదిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈయన ఓడిపోయారు. ఇప్పుడు వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్థానం నుంచి మళ్ళీ టిడిపి మిత్రపక్షమైన బిజెపి బరిలోకి దిగనుందని తెలిసిన తర్వాత ఆయన టిడిపికి గుడ్బై చెప్పి, టిఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.అందుకే మోత్కుపల్లి నరసింహులు టిఆర్ఎస్పై విమర్శలు చేయడం లేదని కూడా అంటున్నారు.
ఇదే జరిగితే ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసులో తీవ్రంగా నష్టపోయిన టిడిపికి గట్టి షాక్ అవుతుంది. ఈయనతో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవాలని చూసిన టిడిపికి ఇది కోలుకోలేని పరిణామంగానే చెప్పుకోవాలి.