మొఘల్ చక్రవర్తి కోడలేంటి… పకోడీలమ్ముకోడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. మీరు విన్నది నిజమే. ఆమె పేరు సుల్తానా బేగం. ఇండియాని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు స్వయానా కోడలు అవుతుంది.
రాజభవనాలు, రాణీవాసాలు పోగొట్టుకున్న ఆమె కోల్ కతాలోని ఓ మురికి వాడలో ఓ పూరిగుడిసెలో అద్దెకుంటోంది. పకోడీలు, బజ్జీలు అమ్ముకుంటూ ఆరుగురు చిన్నారులను పెంచుతూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 2003లో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఓ ఇంటిని అందించింది. కానీ స్థానికంగా ఉండే కొందరు గూండాలు దౌర్జన్యంగా ఆమె ఇంటిని ఆక్రమించారు.
ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.6వేల ఫించన్ అందుతోంది. బాగా వృద్ధురాలు కావడంతో పనిచేసే ఓపిక లేకపోవడంతో ఆ ఫించన్ తోనే ఆరుగురు పిల్లల సంరక్షణ బాధ్యత చూస్తూ కాలం వెళ్లదీస్తోంది. మొఘల్ సామ్రాజ్య అధిపతులు కట్టించిన తాజ్ మహల్, ఎర్రకోట వంటి వాటితో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు గడిస్తున్నా వాటికి వారసులైన వారికి మాత్రం చిల్లిగవ్వ కూడా అందకపోవడం బాధాకరం.
{youtube}fURKl57jRIE{/youtube}