అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతిలో అమాయకులైన భర్తలు.. ప్రియుడి మోజులో పడి భర్తలను హతమార్చడానికి కూడా వెనుకాడటంలేదు భార్యలు. ప్రియుడి మత్తులో భర్తను చంపేందుకు ప్రయత్నించిందో నవ వధువు. పెళ్లైన నెల రోజులకే కట్టుకున్నోడిని చంపేందుకు ప్లాన్ చేసింది. సీన్ కాస్త రివర్స్ అవడంతో ప్రియుడు, ప్రయురాలు ఊచలు వెక్కిస్తున్నారు. ఈ సంఘటన చెన్నైశివార్లలో చోటచేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో వివాహమైంది. ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి వ్యాహ్యాళికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ. 1000 తీసుకుని పరారయ్యారు. వెంటనే అనిత పోలీసులకు ఫోన్ చేసింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన కదివరన్ను ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయమయ్యిందని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తీవ్రగాయాలతో పడివున్న కదిరవన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన అనిత, పోలీసులకు తానే స్వయంగా ఫిర్యాదు చేసింది. అయితే అనిత చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటాను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం చలనం లేకుండా, చూస్తుండిపోయినట్టు కనిపించడంతో, ఆమెను తనదైన శైలిలో విచారించారు. దీంతో ఆసలు నిజం బయటకు వచ్చింది.
ఘటనకు ముందు అనిత పదే, పదే ఓ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. అతడు తూత్తుకుడికి చెందిన ఆంటోని జగన్గా గుర్తించారు. అతడు మధురై కామరాజ్ యూనివర్శిటీలో పీజీ చదువుతున్నట్లు తేలింది. కాలేజీ చదువుతున్న సమయం జగన్ అనే యువకుడిని ప్రేమించానని, అయితే, తాము పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో తనకు కదిరవన్ తో పెళ్లి చేశారని చెప్పింది. దుండగుల దాడి జరిగినట్టుగా ప్లాన్ చేశానని, ఆపై తామిద్దరమూ కలసి జీవిద్దామని భావించామని చెప్పింది. ఆమెను విచారించిన తరువాత పోలీసులు మధురైలో ఉన్న జగన్ ను కూడా అరెస్ట్ చేసి, ఇద్దరినీ కటకటాల వెనక్కు నెట్టారు.