Monday, April 29, 2024
- Advertisement -

నంద్యాల‌లో బాల‌య్య ఒక రోజు కామెడి ప్రాచారం…భ‌లేవాడివి బాసూ..

- Advertisement -

నీతులుఇత‌రుల‌కుచెప్పేందుకేఉంటాయికానిఅవిమాత్రంత‌మకువ‌ర్తించ‌వుఅన్న‌సామెతఇప్పుడుబాల‌య్య‌బాబుకు స‌రిగ్గా స‌రిపోతుంది. టీడీపీ త‌రుపున ఒక రోజు ప్ర‌చారానికి వ‌చ్చిన నంద‌మూరి న‌టసింహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై పేల్చిన‌కామెడీ డైలాగులు ప‌సందుగా ఉన్నాయి.

ప్ర‌చారంలో ప్ర‌ధానంగా శిల్పా సోద‌రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బాల‌య్య విమ‌ర్శ‌లు చేశారు.శిల్పా చక్రపాణి రెడ్డి పాలు తాగి రొమ్ముగుద్దినట్టుగా వ్యవహరించాడని అనడం. శిల్పా చక్రపాణి కి తెలుగుదేశం ఎంతో చేసిందని బాలయ్య చెప్పాడు.శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైకాపా లోకి వెల్లేట‌ప్పుడు రాజీనామా పత్రాన్ని విసిరిగొట్టి వెల్లారు.

శిల్పా సోద‌రుల‌మీద బాల‌య్య ఆడిపోసుకోవ‌డం ఎందుకొ అర్థం కావ‌డంలేదు.వైకాపా తరపున గెలిచి టీడీపీలోకి వెల్లి మంత్రి .పదవులను అనుభవిస్తున్న వారిని పక్కనే పెట్టుకుని, వారి తరపున ప్రచారం చేస్తూ బాలయ్య.. రాజీనామా చేసి వెళ్లిన వారిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.రాజకీయ వ్యభిచారం అనదగ్గ ఫిరాయింపును చేసిన వారిని పక్కనే పెట్టుకుని.. బాలయ్య శిల్పా సోదరులకు నీతులు చెప్పడం హాస్యాస్ప‌దంగా ఉంది.

ఇక వెన్నుపోటు రాజ‌కీయాల గురించి బాల‌య్య మాట్లాడ‌టం చూస్తె అంద‌రూ అవాక్క‌వుతున్నారు.తండ్రి ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు సత్కారంలో బాలయ్య కూడా భాగస్వామే క‌దా. ఇప్పుడు కొత్త‌గా వెన్నుపోటు రాజ‌కీయాలన‌డం ఎందుకో. అధికారం లేక‌పోయినా ప్ర‌జాసేవ చేయ‌చ్చ‌న్న బాల‌య్య తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని బాలయ్య ఓటర్లకు పిలుపునివ్వడం కొసమెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -