నంద్యాల ఉపఎన్నిక వ్యవహారం ముఖ్య మంత్రి చంద్రబాబుకు కత్తిమీద సాములా మారంది. ఎవరికి టికెట్టు ఇవ్వాలో తెలియక గిలగిల కొట్టుకుటున్నారు. శిల్పా,భూమా వర్గాలకు నచ్చజెప్పలేక బాబు తలపానం తోలోకి వచ్చింది. ఇరు వర్గాలలో ఎవర్గానికి సీటు కేటాయించినా అది మొదటికే మోసం వస్తుండటంతో ఏంచేయాలో పాలుపోవడంలేదు.
తన వర్గంలోని వారే పోటీ పడి మరీ తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని పట్టుబడుతూ ఉండటంతో ఈ పంచాయితీ ఇంకా ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యంగా శిల్పా మోహన్ రెడ్డి రాజీ పడే సమస్యే లేదంటూ బాబుకు తేల్చి చెప్పారు. భూమా నాగిరెడ్డి చనిపోయాక సాంప్రదాయం ప్రకారం తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిల ప్రియకూడా వెనక్కు తగ్గడంలేదు. మంత్రి పదవికి రాజీనామ చేసేందుకైనా సిద్ధమనే సంకేతాలు పంపింది.
శిల్పా మోహన్రెడ్డి వాదన వేరేలా ఉంది. నంద్యాలలో సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయదని శోభా అంత బలమైన నాయకురాలిగా అఖిల ప్రియను చూడటం లేదన్నారు. సీనియర్ అయిన తాను తప్ప ఈ ఉపఎన్నికను ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని బల్లగుద్ది చెబుతున్నాడు. కాని అఖిల ప్రియ మాత్రం ఇప్పుడు టిక్కెట్ తమకు ఇవ్వకపోతే నియోజకవర్గంలో చులకన అవుతామని పైగా నాగిరెడ్డి ని చూసి ఓట్లు వేసిన వాళ్ళు శిల్పా కు వేసే ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదని వాదిస్తోంది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాలని ప్రయత్నించినా పలితం లేకపోవడంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడింది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆలోచిస్తామని పైకి అంటున్నా…. వైసీపీ నుంచి జగన్ అభ్యర్తిని ప్రకటించిన తర్వాతే ..ప్రకటించాలని బాబు వేచిచూసెధోరనిలో ఉన్నారు. గతంలో శిల్పా ఓడిపోయింది తమ మీదె కాబట్టి ..ఇప్పుడుకూడా అదే రిపీట్ అవుతుందని భామా వర్గం అంటోంది.మరోవైపు కార్యకర్తల మధ్య బ్యాలెన్స్ చేసే పరినితి అఖిలప్రియకు లేదంటోంది శిల్పావర్గం. జగన్ మాత్రం టికెట్ విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. స్థానిక వ్యాపారవేత్త, సౌమ్యుడిగా పేరున్న ప్రతాప్ థియేటర్ యజమానికి ఇవ్వాలని పలువురు ఇప్పటికే జగన్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇదంతా చంద్రబాబు ఆడుతన్న నాటకమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మూడవసారి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఈసమస్యను పరిస్కరించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ మదిలో ఏముందో అర్థం కావడంలేదు. రాజమౌలి బాహుబలి సినిమాను సాగదీసినంతగా సాగదీస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నాటకంలో ఇప్పుడే క్లైమాక్స్ చూపిస్తే ఆసక్తి ఏముంటుంది. అందుకే బాబు సాగదీస్తున్నారు. నియేజక వర్గంలో ఎవరికి పట్టుఉందో తెలుసుకోడానికే బాబు ఇదంతా చేస్తున్నట్లు సమాచారం. తమకే టికెట్టు వస్తాదని ఎదురు చూస్తున్న ఇరు వర్గాలలో ఎవరోఒకరు బలయ్యేది ఖాయం.బాహుబలి సినిమాలో కట్టప్ప చేతిలో బాహుబలి ప్రభాస్ బలయ్యారు. మరి నంద్యాల ఉప ఎన్నిక సినిమాలో బాబు చేతిలో ఎవరు బలి అవుతారోనని రాజకీయ వర్గాల్లో చర్చించుకొంటున్నారు. బాబు చేతిలో అఖిలప్రియనా…శిల్పాను బలిఅయ్యేదెవరో చూడాలంటే వేయిట్ అండ్ సీ.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}Zy8q-Vi_Qy8{/youtube}
Also Read