Tuesday, May 7, 2024
- Advertisement -

కందిన యువరాజు చెయ్యి

- Advertisement -

భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ యువరాజు విలియమ్స్‌కు షాక్ తగిలింది. సరదాగా భార్యతో కలిసి ఓ నాలుగు రోజులు భారత్ జాలీ ట్రిప్ వేయాలనకున్న విలియమ్స్‌కు భారత ప్రధాని ఓ చేదు కానుక ఇచ్చారు.

గురువారం ఉదయం విలయమ్స్ దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖాజీరంగ పార్కులో వన్యప్రాణులతో సరదాగా గడిపారు.  బుధవారం సంభవించిన భూకంప ప్రాంతాల్లో పర్యవేక్షించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఎవరినైనా కలుసుకున్నప్పుడు నరేంద్ర మోదీ ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆలింగనం కూడా చేసుకుంటారు. విలియమ్స్ ను చూసి మరింత ప్రేమను ఒలకపోయాలనుకున్నారో ఏమో కాని విలియమ్స్ చేయిని గట్టిగా నొక్కారు. ఎంత గట్టిగా అంటే విలియమ్స్ అరచేయి కందిపోయేంతగా ప్రధాని నొక్కేసారు. ఈ ఫొటో ప్రస్తుతం నెటిజన్లలో హల్ చల్ చేస్తోంది. మోదీ మెరటు అనుకోవాలో.. విలియమ్స్ మరీ ఇంత సుకుమారి అనుకోవాలి తెలియడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -