Friday, April 19, 2024
- Advertisement -

కాలర్‌ ట్యూన్‌లో కొత్త మార్పులు.. అమితాభ్ కి దెబ్బ..!

- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా ప్రజల్ని చైతన్య పరిచేందుకు రూపొందించిన కాలర్‌ ట్యూన్‌లో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ స్వరంతో వచ్చే ఆ ట్యూన్‌ స్థానంలో ఓ మహిళ గొంతుక వినిపిస్తోంది.

దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైన వేళ.. కాలర్‌ ట్యూన్‌లోని విషయం కూడా మారింది. ”కొత్త సంవత్సరం కొవిడ్‌ టీకాల రూపంలో సరికొత్త ఆశాకిరణాలను తీసుకొచ్చింది. భారత్‌లో రూపొందించిన టీకాలు ఎంతో సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనా వైరస్‌ నుంచి అవి కాపాడగలవు. వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను విశ్వసించొద్దు. మీ వంతు వచ్చినప్పుడు కచ్చితంగా టీకా తీసుకోండి.” అని కొత్త కాలర్‌ ట్యూన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకూ పాటిస్తున్న మాస్క్‌, శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలన్నీ కొనసాగించాలని సూచిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -