- Advertisement -
ఏపీలో నూతన కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఈ నెలాఖరు నుంచి తాత్కాలిక భవనంలో అయినా ఏపి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కార్యకర్తల సంక్షేమ నిధి సమన్యయ కర్త నారా లోకేశ్ కూడా నెలలో సగం రోజులు ఏపిలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. విజయవాడ లేదా గుంటూరు జిల్లాలో ఈ నెలాఖరులోగా తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కార్యకర్తల సమస్యలను అక్కడే పరిష్కరించాలని నిర్ణయించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న లోకేశ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.