Monday, May 6, 2024
- Advertisement -

అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్

- Advertisement -

భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక ఆహ్వానం తప్పులతడక అయ్యింది. ఇక్కడి అధికారులకు నిర్లక్ష్యం ఎక్కువనే మాటకు ఈ సంఘటన ఊతమిచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ నెల 15 వ తేదిన శ్రీరాముల వారి కల్యాణం.. 16 తేదిన శ్రీరామ పట్టాభషేకాలకు ఆహ్వానిస్తూ శుభలేఖను ముద్రించారు.

ఇందులో ఈ నెల 16న శ్రీరామ పట్టాభిషేకానికి బదులు మార్చి 29 వ తేది.. అది గత సంవత్సరం అంటే 2015 అని ముద్రించారు. వేలాదిగా ముద్రించిన ఈ శుభలేఖల్లో కొన్ని ఇప్పటికే పంచేశారు. విలేకరులు ఈ తప్పును చూసి గుర్తించే వరకూ ఆలయ అధికారులెవ్వరికి ఇది తెలియలేదు.

దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆలయ ఈవో జ్యోతి ఈ ఆహ్వన పత్రిక ముదించే బాధ్యతలు చూసిన వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మిగిలిన అధికారులు పట్టుపడుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -